ఐక్యరాజ్యసమితి, ఫిబ్రవరి 5 (పిటిఐ):
కృత్రిమ మేధస్సు (ఏఐ)పై ఏర్పాటు చేసిన కొత్త స్వతంత్ర శాస్త్రీయ ప్యానెల్లో సేవలందించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ సూచించిన 40 మంది ప్రముఖ నిపుణుల్లో ఐఐటీ మద్రాస్కు చెందిన ఒక ప్రొఫెసర్ కూడా ఉన్నారు.
ఈ ప్యానెల్కు సంబంధించిన జాబితాను బుధవారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ముందు గుటెరెస్ ప్రవేశపెట్టారు. ఈ ప్యానెల్ సభ్యులు మూడు సంవత్సరాల కాలపరిమితికి పనిచేస్తారు.

