
న్యూయార్క్, జూలై 30 (పిటిఐ): భారత్తో ట్రేడ్ డీల్ ఇంకా ఫైనల్ కాలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల కంటే ఎక్కువ టారిఫ్లు విధిస్తుందని ఆయన విమర్శించారు.
మంగళవారం స్కాట్లాండ్ నుంచి వాషింగ్టన్కు తిరిగివస్తున్న సమయంలో, ఎయిర్ ఫోర్స్ వన్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, “ఇంకా కాదు,” అంటూ ట్రేడ్ డీల్ పై స్పందించారు.
అమెరికా భారత్పై 20-25 శాతం వరకు అధిక టారిఫ్లు విధించబోతున్నదని వచ్చిన వార్తలపై స్పందిస్తూ, “అవును, నాకు అలా అనిపిస్తోంది,” అన్నారు. “భారత్ నా స్నేహితుడు, మోదీ నా స్నేహితుడు,” అని అన్నారు.
పాకిస్థాన్తో భారత్ యుద్ధం తన అభ్యర్థనపై ముగిసిందని ట్రంప్ మళ్లీ అన్నారు.
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కోసం చర్చల తరువాతి దశకు సంబంధించిన సమావేశం కోసం అమెరికా బృందం ఆగస్టు 25న భారత్కు వస్తుందని న్యూఢిల్లీలో ఉన్న ఒక అధికారి తెలిపారు.
