
బెలెం (బ్రెజిల్), నవంబర్ 21 (PTI): బ్రెజిల్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి COP30 క్లైమేట్ సమ్మిట్ ప్రధాన వేదికలో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించి, కనీసం 13 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగడంతో అక్కడున్న వేలాది మంది భద్రత కోసం పరుగులు తీశారు.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో ‘బ్లూ జోన్’ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో అన్ని సమావేశాలు, చర్చలు, దేశాల పవిలియన్లు, మీడియా కేంద్రం, ముఖ్య అతిథుల కార్యాలయాలు, అలాగే ప్రధాన ప్లీనరీ హాల్ ఉన్నాయి.
అగ్ని ప్రమాదం సమాచారం బయటకు రావడంతో ప్రజలు అన్ని నిష్క్రమణ ద్వారాల ద్వారా వేగంగా బయటకు పరుగెత్తారు.
UN COP30 నిర్వహణ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది:
“పొగ పీల్చుకోవడంతో బాధపడ్డ 13 మందికి అక్కడికక్కడే చికిత్స అందించారు. వారి పరిస్థితిని పరిశీలిస్తూ, అవసరమైన వైద్య సహాయం అందించారు.”
సంఘటన జరిగిన సమయంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కూడా అక్కడే ఉండగా, యూఎన్ భద్రతా విభాగం (UNDSS) వారు వెంటనే అతడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు తెలిసింది.
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భారతీయ ప్రతినిధి బృందంతో పాటు భారత పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా బ్లూ జోన్ లో ఉన్నారు. అయితే, ఆయనతో పాటు ఇతర భారతీయ అధికారులు సురక్షితంగా బయటకు వచ్చారు. PTI TR GRS GRS GRS
Category: Breaking News
SEO Tags: #swadesi, #News, Fire breaks out at main venue of UN COP30 Climate Summit in Brazil’s Belem, 13 people injured
